తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో పొలిటికల్ కథ సిద్ధంగా ఉంది. అయితే, ఇది వెండితెరపై వచ్చే సినిమా కాదు.. ప్రము ఓటీటీ సోనీ లివ్లో స్ట్రీమింగ్కి రాబోతున్న ‘మయసభ’ వెబ్ సిరీస్. దర్శకుడు దేవా కట్ట డైరెక్ట్ చేసిన ఈ పొలిటిక్ థ్రిల్లర్ సిరీస్కు సంబంధించిన టీజర్ను తాజాగా రిలీజ్ చేశారు.
ఈ టీజర్ను చూస్తుంటే మన తెలుగు ప్రజలకు ఎంతో పరిచయం ఉన్న ఇద్దరు రాజకీయ నేతలకు సంబంధించిన కథ ఇది అని అర్థమవుతుంది. ఇద్దరు స్నేహితులు, రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా ఎలా మారారు.. ఆ తర్వాత వారి మధ్య రాజకీయ వైరం ఎలా తయారైంది.. అనే కథతో ఈ సిరీస్ను దేవా కట్టా తెరకెక్కించాడు.
ఇక ఈ సిరిస్లో ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేవా కట్టా మార్క్ డైలాగులు మనకు ఈ టీజర్లో వినిపించాయి. టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ వెబ్ సిరీస్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సిరీస్ను ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ పేర్కొంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి