తెలుగు సినిమాకు ప్రేమలేఖ రాస్తున్న ‘కంచరపాలెం’ మేకర్స్

తెలుగు సినిమాకు ప్రేమలేఖ రాస్తున్న ‘కంచరపాలెం’ మేకర్స్

Published on Jun 28, 2025 6:00 PM IST

టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎక్కువకాలం గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాలకు ఆదరణ ఎప్పటికీ తగ్గదు. ఈ జాబితాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రం ‘C/O కంచరపాలెం’. దర్శకుడు వెంకటేష్ మహా డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రవీణ పరుచూరి, రానా దగ్గుబాటి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఓన్ చేసుకున్నారు.

ఇక ఇలాంటి క్లాసిక్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రవీణ పరుచూరి, రానా దగ్గుబాటి మరోసారి చేతులు కలిపారు. ఈసారి వారి నుంచి రాబోయే సినిమా మరింత ప్రత్యేకంగా ఉండబోతుందని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ‘‘తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాము. వాటితోనే నవ్వాం, ఏడ్చాం, చప్పట్లు, ఈలలు కొట్టాం. అలాంటి మనసుకు దగ్గరైన సినిమాలన్నిటికీ ఇది మా ప్రేమ లేఖ!’’ అంటూ ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ చేశారు.

కాగా, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే ఆసక్తిని పెంచారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు