‘కుబేర’ తర్వాత ధనుష్ మరోసారి ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..?

‘కుబేర’ తర్వాత ధనుష్ మరోసారి ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..?

Published on Jun 25, 2025 3:05 AM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన మార్క్ కంటెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించగా అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాలో ధనుష్ పర్ఫార్మెన్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ చిత్రంగా నిలవడంతో ధనుష్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తెలుగులో ఆయన నటించిన రెండో సినిమా కూడా సక్సెస్ కావడంతో ధనుష్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ‘కుబేర’ తర్వాత ధనుష్ నెక్స్ట్ తెలుగు చిత్రం ఎవరితో చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

కాగా, ఇప్పటికే ధనుష్ తన తొలి తెలుగు చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరికి మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2027లో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ‘సార్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన వెంకీ అట్లూరితో మరోసారి ధనుష్ చేతులు కలపడంతో అప్పుడే ఈ ప్రాజెక్ట్‌పై బజ్ క్రియేట్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు