టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన భారీ చిత్రం “కన్నప్ప” కోసం అందరికీ తెలిసిందే. యదార్ధ ఘటనల ఆధారంగా గ్రాండ్ స్కేల్ లో అందులోని పాన్ ఇండియా లెవెల్లో భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి దగ్గరకి వస్తుంది.
ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ రాగా ఫైనల్ గా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ పై లేటెస్ట్ క్లారిటీ బయటకి వచ్చింది. దీనితో ఈ జూన్ 21న గ్రాండ్ గా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో మేకర్స్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో దాదాపు సినీ తారలు మొత్తం కనిపిస్తారట.
అంటే మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లు హాజరవుతారని తెలుస్తుంది. ఇక వీరితో పాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా అటెండ్ అయ్యేందుకు అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్టు వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమా రిలీజ్ ని ఈ జూన్ 27న పాన్ ఇండియా లెవెల్లో ఘనంగా చేస్తున్నారు.