పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ యాక్షన్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఓజి సినిమా షూటింగ్ ఇపుడు కంప్లీట్ అయ్యి రిలీజ్ కి కూడా దగ్గరకి వస్తుంది. మరి ఈ సమయంలో ఓజి బిజినెస్ పై కూడా సాలిడ్ బజ్ వినిపిస్తుంది. దీనితో సీడెడ్ బిజినెస్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది.
దీని ప్రకారం ఓజి సీడెడ్ రైట్స్ కోసం యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ ముందు వరుసలో ఉన్నారట.24 కోట్ల భారీ మొత్తంలో ఇచ్చి సీడెడ్ హక్కులు తాను సొంతం చేసుకుంటున్నట్టు టాక్. అలాగే మిగతా ఏపీ మొత్తం మరో టాప్ నిర్మాత 80 కోట్లకి పైగా ఇచ్చి కొన్నట్టుగా కూడా సమాచారం. మొత్తానికి ఏపీలో మాత్రం ఓజి బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది అని చెప్పవచ్చు.