తమిళ హీరో సూర్య నటించిన రీసెంట్ మూవీ ‘రెట్రో’ రిలీజ్కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఈ సినిమా రావడంతో తప్పకుండా కథలో ఏదైనా మ్యాజిక్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ప్రమోషన్స్ మొదలుకొని, సినిమా రిలీజ్ అయ్యే వరకు సినిమాలో ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు.
దీంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. ఫ్లాప్ చిత్రంగా నిలిచిన రెట్రో ఇప్పుడు ఓటీటీలో స్పెషల్ ప్లానింగ్తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వెబ్ సిరీస్గా ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు అధనపు వెర్షన్ను కలిపి వెబ్ సిరీస్గా చూపెట్టాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.థియేటర్లలోనే ఈ సినిమాకు అంతంత మాత్రం రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు వెబ్ సిరీస్గా ఓ ఫ్లాప్ సినిమాను ఎందుకు ప్లాన్ చేస్తున్నారో.. అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.