గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’లో నటిస్తున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్కు సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్కు చేరాయి.
ఇక ఈ చిత్ర డిజిటల్ రైట్స్ డీల్ అంచనాలను మరింత పెంచేలా చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర రైట్స్ను ఏకంగా రూ.105 కోట్ల భారీ డీల్తో నెట్ఫ్లిక్స్ దక్కించుకుందట. ఇంత భారీ రేటుకు ‘పెద్ది’ డిజిటల్ రైట్స్ సేల్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
పెద్ది సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటే, ఈ రేంజ్లో కేవలం డిజిటల్ రైట్స్ డీల్ జరుగుతుందని సినీ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోండగా ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.