పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయింది. అటు ఓజి కూడా రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ పవన్ బిజీ అయ్యాడు. అయితే, పవన్ తన కెరీర్లో చాలా అరుదుగా చేసే ఫీట్ను ఇప్పుడు మరోసారి రిపీట్ చేస్తున్నాడు.
పవన్ సినిమా కెరీర్లో ఒకే ఏడాదిలో రెండు సినిమాలు వచ్చిన సందర్భం చాలా అరుదు. పవన్ 1998లో సుస్వాగతం, తొలిప్రేమ చిత్రాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఆ తర్వాత 2006 సంవత్సరంలో పవన్ ఏడు నెలల గ్యాప్లో ‘బంగారం’, ‘అన్నవరం’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత 2011లో తీన్మార్, పంజా చిత్రాలు.. 2012లో గబ్బర్సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలను ఒకే ఏడాదిలో రిలీజ్ చేశాడు. అయితే ఆ తర్వాత్ పవన్ నుంచి ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రాలేదు.
2025లో కేవలం మూడు నెలల గ్యాప్లోనే పవన్ హరిహర వీరమల్లు, ఓజి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రిలీజ్ డేట్ అటుఇటు అయినా, ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్ కావడం ఖాయం. దీంతో చాలా ఏళ్ల తర్వాత పవన్ మరోసారి ఈ డబుల్ ట్రీట్ను రిపీట్ చేస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.