నైజాంలో ‘హరిహర వీరమల్లు’ కోసం టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కూడా?

నైజాంలో ‘హరిహర వీరమల్లు’ కోసం టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కూడా?

Published on May 27, 2025 7:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ ఈ చిత్రంకి సమయం తక్కువే ఉన్న నేపథ్యంలో ఇంకా బిజినెస్ కూడా ఫైనల్ అయ్యే స్థితిలో ఉంది.

ఇలా నైజాం మార్కెట్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీనితో హరిహర వీరమల్లు కోసం ఆల్రెడీ సితార వారు రేస్ లో ఉన్నారనే బజ్ ఉంది. అయితే ఇపుడు మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు కూడా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. దీనితో నైజాం మార్కెట్ లో వీరమల్లు ఎవరికి సొంతం అవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు