మరో ఓటీటీ లోకి రాబోతున్న “గేమ్ ఛేంజర్”

మరో ఓటీటీ లోకి రాబోతున్న “గేమ్ ఛేంజర్”

Published on Mar 5, 2025 7:03 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అంజలి అలాగే కియార అద్వానీ హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా గేమ్ ఛేంజర్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం విపరీతంగా నెగిటివ్ ని అందుకోవాల్సి వచ్చింది. అయితే థియేటర్స్ తర్వాత నెల లోపే ఓటీటీలో కూడా ఈ చిత్రం వచ్చేసింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోగా ఇందులో హిందీ మినహా మిగతా సౌత్ భాషల్లో అందుబాటులో వచ్చింది. ఇక హిందీ హక్కులు అయితే జీ5 సొంతం చేసుకోగా ఇపుడు వీరు ఈ సినిమాని అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు రివీల్ చేశారు. అయితే డేట్ ఎప్పుడు అనేది ఇంకా రివీల్ కావల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు అలాగే దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు