మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం “విశ్వంభర”. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. త్రిష కృష్ణన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మే 9, 2025న విడుదల చేయాలని భావిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం శివరాత్రి శుభ సందర్భంగా ఈ సినిమా మొదటి సింగిల్ను విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అన్నట్టు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.