‘అలా మొదలైంది’ సినిమా ద్వారా పరిచయం అయిన నిత్యామీనన్ ఆ చిత్రంనుండి మొదలుకుని, తానూ నటిస్తున్న ప్రతీ చిత్రంలోనూ నటనాపరంగా అంతకంతకూ ఎదుగుతుంది. ఒక విభిన్నమైన తారగా వెలుగుతూ ఎటువంటి పాత్రనైనా తన భుజాలపైన వేసుకుంటుంది. తన తాజా చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో తన నటన ద్వారా సినిమా అఖండ విజయానికి తోడ్పడింది. దీని ద్వారా టాలీవుడ్లో అగ్రతారల జాబితాలోలో తానూ స్థానం సంపాదించుకుంది.
నిత్య సినిమాల ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తుంది. ఆమె ఒక మలయాళీ అయినా తన మొదటి సినిమానుండి తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. తాజా చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో తన పాత్రకే కాక తన కో-స్టార్ ఇషా తల్వార్ పాత్రకు సైతం తానే దుబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. నిత్యని త్వరలో మరలా శర్వానంద్ నటిస్తున్న ‘ఏమిటో ఈ మాయ’ సినిమా ద్వారా మనం చూడొచ్చు.
అగ్రతారల జాబితాలో చేరిన నిత్యామీనన్
అగ్రతారల జాబితాలో చేరిన నిత్యామీనన్
Published on Apr 21, 2013 9:00 AM IST
First Posted at 09:20 on Apr 21st
సంబంధిత సమాచారం
- ‘బిగ్ బాస్ 9’.. మొదటి ఎలిమినేట్ ఎవరంటే ?
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మహేష్’ సినిమా కోసం భారీ కాశీ సెట్ ?
- పరిపూర్ణ రచయితగా ఎదగాలనేది నా బలమైన కోరిక – గీత రచయిత శ్రీమణి
- పవన్ ఆ విద్యను ప్రోత్సహించాలి – సుమన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి