ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా చెప్పుకునే వాళ్ళలో దర్శకరత్న దాసరినారాయణ రావు ఒకరు. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో జరిగే తప్పులపై ఘాటుగా స్పందించే దాసరి ఈ రోజు వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ ప్లాటినం డిస్క్ వేడుకకి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన కోన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. దాసరి మాట్లాడుతూ ‘ ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రతి ఆడియో ఫంక్షన్ రికార్డింగ్ డాన్సు షోస్ మాదిరిగా ఉన్నాయి. అలాంటి వేడుకలు ఇండస్ట్రీకి శ్రేయష్కరం కాదు. అందుకే నేను ఇలాంటి కార్యక్రమాలకి నేను హాజరు కావడం లేదు. ఆడియో గానీ సినిమా గానీ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని’ ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే దాసరి గారు ఓ కార్యక్రమమలో హీరోయిన్లు దర్శక, నిర్మాతలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, తమ సినిమాల ఆడియో ఫంక్షన్ లకే రావడం లేదని హీరోయిన్స్ పై సంచలన వ్యాఖలు చేసారు.
ఆడియో ఫంక్షన్స్ పై ధ్వజమెత్తిన దాసరి.!
ఆడియో ఫంక్షన్స్ పై ధ్వజమెత్తిన దాసరి.!
Published on Mar 19, 2013 4:52 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ తో ‘మిరాయ్’ దర్శకుడు !
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- బిగ్ బాస్ 9: వీక్షకుల్లో ఈ కంటెస్టెంట్ కి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్
- ‘వైబ్’ సాంగ్ అందుకే తీసేశారట !
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- గుణశేఖర్ ‘యుఫోరియా’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో సర్ప్రైజ్
- ‘లెనిన్’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో