క్రేజీ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన “మిషన్ మజ్ను” అనే సినిమాలో నటిస్తోంది. కాగా ఈ చిత్రం షూట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది. అయితే రష్మిక తన తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్ కు కూడా సంతకం చేసింది. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సరసన డెడ్లీ అనే స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ చిత్రంలో ఆమె కనిపించనుంది. తండ్రి-కుమార్తె కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్వీన్, సూపర్ 30 దర్శకుడు వికాస్ బహల్ దర్శకత్వం వహించనున్నారు.
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్టును నిర్మి స్తోంది, మార్చి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక “మిషన్ మజ్ను” సినిమా కథ ప్రకారం సౌత్ ఇండియన్ భామ కావాలి కాబట్టి, రష్మికను వాళ్ళు తీసుకున్నారు. కానీ, రష్మికకు ఈ సినిమా ఎంతవరకూ ప్లస్ అవుతుందో చూడాలి. “సరిలేరు నీకెవ్వరు”, “గీత గోవిందం” సినిమాలు చూసి రష్మిక యాక్టింగ్ పై బాలీవుడ్ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారట. “మిషన్ మజ్ను” డైరెక్టర్ కు కూడా రష్మిక నటన బాగా నచ్చిందట.