కరోనాతో సినిమాల రిలీజ్ డేట్స్ అయోమయంలో పడ్డాయి. అయితే ఈ సారి సంక్రాంతికి సినిమాల పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఎలాగూ సినిమా హాళ్లు కూడా పూర్తిస్థాయిలో సంక్రాంతి నాటికి తెరుచుకునే అవకాశం ఉండటంతో.. స్టార్ హీరోల సినిమాలను సంక్రాంతి సీజన్లోనే విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, అలాగే భారీ బడ్జెట్ చిత్రం ‘కెజిఎఫ్ 2’ పోటిగా రానున్నాయి. అలాగే ఇంకొన్ని ఆసక్తికరమైన చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. అఖిల్, పూజా హెగ్డేల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, రవితేజ ‘క్రాక్’, గోపిచంద్ ‘సీటిమార్’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’లు కూడా సంక్రాంతికే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అలాగే బాలయ్య – బోయపాటి సినిమా కూడా సంక్రాంతికే రాబోతుందట. కాకపోతే ఏ సినిమా ఎప్పుడు రెడీ అవుతుందో క్లారిటీ లేదు. అయితే పై రిలీజ్ లిస్టులో ఉన్న సినిమాలన్నీ ఇప్పటికే మెజార్టీ షూటింగ్ ను పూర్తీ చేసుకున్నవే. అయితే ప్రభాస్ ‘రాథేశ్వామ్’, మెగాస్టార్ ‘ఆచార్య’, ‘బన్నీ – సుకుమార్’ సినిమాలు మాత్రం సంక్రాంతి పోరులో లేవు అని తెలుస్తోంది. మెగాస్టార్ షూట్ లో పాల్గొనడానికి ఇంట్రస్ట్ చూపించడం లేదు. ప్రభాస్ రాథేశ్వామ్ డిసెంబర్ లోపు షూట్ వరకు అయిపోయినా…ఆ సినిమాకు ఎక్కువ విఎఫ్ఎక్స్ పనులు ఉంటాయి కాబట్టి, సంక్రాంతి నాటికి ఆ సినిమా పూర్తి కాదు.