చంద్రముఖి 2 పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన లారెన్స్.

చంద్రముఖి 2 పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన లారెన్స్.

Published on Aug 2, 2020 1:00 PM IST

రజనీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రలతో 2005లో వచ్చిన చంద్రముఖి ఘనవిజయం అందుకుంది. ముఖ్యంగా రజిని కాంత్ మరియు జ్యోతికల నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ చేయాలంటూ ఎప్పటి నుండో ప్రతిపాదన ఉండగా, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఐతే చంద్రముఖి సీక్వెల్ లో కియారా అద్వానీ, సిమ్రాన్, జ్యోతిక నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే హీరో లారెన్స్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది.

దీనిపై హీరో లారెన్స్ స్పందించారు. చంద్రముఖి 2 సీక్వెల్ లో కియారా అద్వానీ, సిమ్రాన్ మరియు జ్యోతిక నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని అన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అన్న ఆయన నటీనటుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు.

తాజా వార్తలు