‘విరూపాక్ష’లో ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

‘విరూపాక్ష’లో ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Jun 27, 2020 9:14 PM IST


క్రిష్ – పవన్ కళ్యాణ్ కలయికలో రానున్న సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పాత్ర సెకెండ్ హాఫ్ లో చనిపోతుందని, ఆమె చనిపోయే ఎమోషనల్ సీన్ సినిమాలోనే కీలకం అని.. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి, ఈ చిత్రం అయితే పాన్-ఇండియా రేంజ్ లో రూపొందుతుంది.

అలాగే పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్ డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ నుండి వరుసగా రెండు సినిమాలు రానుండటంతో తమ హీరో ఇక సినిమాలే చేయరని నిరుత్సాహపడిన పవర్ స్టార్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు