2011లో వచ్చిన నువ్విలా చిత్రంతో పరిశ్రమకు పరిచయమయ్యాడు హీరో హవీష్. దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన ఆ సినిమాలో హవీష్ నటనకు మంచి పేరొచ్చింది. ఆ తరువాత జీనియస్ మరియు రామ్ లీల అనే చిత్రాలలో నటించారు. గత ఏడాది ఆయన సెవెన్ అనే ఓ సస్పెన్సు థ్రిల్లర్ ని విడుదల చేశారు. జయాపజయాలతో సంబంధంలో లేకుండా హీరోగా ముందుకు వెళుతున్నాడు హవీష్.
హవీష్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్ ప్రణాళిక గురించిన మీడియాకు తెలియజేశాడు. కాగా హవీష్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ ఒకే చేశాడట. అందులో ఒకటి క్రైమ్ థ్రిల్లర్ కాగా మరొకటి లవ్ స్టోరీ అట. ఈ రెండు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను అని ఆయన చెప్పారు.