ప్రభాస్20 మేకర్స్ కి ఇక తప్పేలా లేదు.

ప్రభాస్20 మేకర్స్ కి ఇక తప్పేలా లేదు.

Published on May 24, 2020 9:38 PM IST

ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం ఎక్కువై పోయింది. వారు ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలంటూ గోల చేస్తున్నారు. అలాగే మూవీ నిర్మాతలుగా ఉన్న యూవీ క్రియేషన్స్ పై సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాహో సినిమా షూటింగ్ సమయంలోనే కొంత షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నుండి అప్డేట్స్ ఇవ్వక పోవడమేంటి అనేది వారి ప్రశ్న.

ఐతే ఈ సినిమాకు సంబందించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇంకా మిగిలి ఉంది. షూటింగ్ పార్ట్ లో మిగిలిన కీలక సన్నివేశాల నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేయాలన్నది వారి ఆలోచనట. అలాగే మూవీ కథపై ఎటువంటి అంచనాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న టీం కొంచెం లేటైనా బెస్ట్ అవుట్ ఫుట్ తో రావాలని వెయిట్ చేస్తున్నారట.

ఐతే ఫ్యాన్స్ లో అసహనం ఆనాటికికానాటికి పెరిగి పోవడంతో వాళ్ళు కనీసం టైటిల్ పోస్టర్ విడుదల చేద్దాం అని భావిస్తున్నారట.మరి చూద్దాం ప్రభాస్ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వారు ఎలా చల్లార్చుతారో. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ లవ్ డ్రామాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు