ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. ఆయన వయస్సు 57 ఏళ్ళు. ఆయన పిల్లల్లో ఒకరు ఆస్ట్రేలియాలో మరొకరు యూఎస్ లో ఉండటం కారణంగా ప్రస్తుతం ఆయన భౌతిక గాయాన్ని మార్చురీకి తరలించారు.
ఆయన 1963 మే 30న ఏలూరులో రంగమణి, వీఎల్ఎన్ చార్యులు దంపతులకు జన్మించారు. అనేక సినిమా ఈవెంట్లతో పాటు ఎన్నికల ప్రచారాల్లోనూ రాజకీయ నాయకుల వాయిస్ను మిమిక్రీ చేసి హరికిషన్ బాగా ప్రాచుర్యం పొందారు. ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్న హరికిషన్ మరణం పట్ల టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది.
123తెలుగు.కామ్ తరఫున హరికిషన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.