ఇప్పుడు పరిస్థితులు అన్నీ బాగుండి ఉంటే టాలీవుడ్ ఎందరో స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్ తో అభిమానుల ఆన్లైన్ సంబరాలతో మారుమోగేది కానీ కరోనా కారణంగా అలాంటి వాటికి అన్నటికి అందరి హీరోల ఫ్యాన్స్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ మూడు వరుస బ్లాక్ బస్టర్ లు వచ్చేసరికి మహేష్ తర్వాత ప్రాజెక్ట్ కోసం అంతకు మించిన రేంజ్ లో ఎదురు చూసారు.
కాస్త గ్యాప్ వచ్చినా పర్లేదు అనుకున్నారు కానీ ఇంత గ్యాప్ రావాల్సి వస్తుంది అని ఎవరూ ఊహించలేదు. దీనితో మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సంశయంలోకి వెళ్ళిపోయింది. మహేష్ తో మొదట వంశీ పైడిపల్లి చెయ్యాల్సి ఉంది కానీ కొన్ని కారణాల చేత మరో సినిమాకు వీరి కాంబో సెట్టయ్యింది. దీనితో రేస్ లోకి దర్శకుడు పరశురామ్ వచ్చారు.
గీత గోవిందం లాంటి భారీ హిట్ తో మరో మెట్టు ఎక్కిన పరశురామ్ సూపర్ స్టార్ ను దర్శకత్వం వహించేందుకు రేస్ లోకి వచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఏదొక అప్డేట్ ఇవ్వాలని టీం గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ముఖ్యంగా ప్రతీ ఏటా మే 31న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజున ఏదొక గిఫ్ట్ ఇచ్చే మహేష్ ఈసారి కూడా ఇద్దాం అనుకుంటే ఆ పరిస్థితులు లేవు కానీ ఈ సినిమా స్టోరీ లైన్ కోసం అయితే ఇప్పుడు ఒక ఆసక్తికర అంశం బయటకొచ్చినట్టు తెలుస్తుంది.
మహేష్ ఇమేజ్ కు తగ్గట్టుగా పరశురామ్ ఒక లవ్ స్టోరీను సిద్ధం చేస్తున్నారని బజ్ వినిపిస్తుంది. మహేష్ నుంచి ఒక లవ్ స్టోరీ వచ్చి చాలా కాలం అయ్యింది. ఒకవేళ ఇదే నిజం అయితే మహేష్ ఫ్యాన్స్ కు మరోసారి వింటేజ్ మహిని చూసే అవకాశం దక్కుతుంది అని చెప్పాలి.