ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్డేట్..!

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్డేట్..!

Published on May 8, 2020 7:17 AM IST

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి వస్తున్న వార్తలు గూస్ బంప్స్ కలిగిస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆయన త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నారు. ఇది కుడా పాన్ ఇండియా చిత్రం అని వినికిడి. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పూర్తి అయిన వెంటనే ఆయన కెజిఫ్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అవుతారు. 2021 చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. కాగా ఈ సినిమా గురించిన లేటెస్ట్ న్యూస్ ఫ్యాన్స్ కి కిక్కెక్కించేలా ఉంది.

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్నాడట. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుందట. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు రెండేళ్లు డేట్స్ కేటాయిస్తున్నారట. 2021 చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2023 తరువాత ప్రేక్షకుల ముందుకు రానుందని వినిపిస్తుంది. త్రివిక్రమ్ మూవీ తరువాత ఎన్టీఆర్ కి భారీ గ్యాప్ పడవచ్చు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు