గ్యాస్ లీక్ ఉదంతంపై పవన్, బన్నీ, చరణ్ ల విచారం

గ్యాస్ లీక్ ఉదంతంపై పవన్, బన్నీ, చరణ్ ల విచారం

Published on May 7, 2020 1:35 PM IST

వైజాగ్ లో నేడు తెల్లవారుజామున ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ ఘటనపై స్పందించారు.

మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు లోనైనవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. చికిత్స తీసుకుంటున్న వారికి మంచి వైద్యం అందించాలని వారు అధికారులను అభ్యర్ధించారు. అలాగే వైజాగ్ సిటీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అలాంటి నగరానికి ఇలా కావడం కలచివేసింది అన్నారు.

తాజా వార్తలు