దిగ్గజ దర్శకుడి విగ్రహానికి పుట్టినరోజు వేడుకలు !

దిగ్గజ దర్శకుడి విగ్రహానికి పుట్టినరోజు వేడుకలు !

Published on May 5, 2020 12:11 AM IST

ఈ రోజు దివంగ‌త ద‌ర్శ‌కులు..న‌టులు..నిర్మాత దాస‌రినారాయ‌ణ రావుగారి 77 వ జ‌యంతి సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఉన్న దాసరి విగ్రహానికి పూలమాల తోనే పుట్టినరోజు వేడుకలు జరిపిన కార్యక్రమంలో దాసరి అరుణ్ కుమార్, ప్రముఖ నిర్మాత కోడి పద్మ, కొమర వెంకటేష్ రాజేంద్ర కుమార్, బంగారు బాబు, పి డి ప్రసాద్, రామసత్యనారాయణ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ రోజున డైరెక్ట‌ర్స్ డే గా గతంలో తెలుగు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌క‌టించింది. ఈ క‌రోనా వ‌ల్ల డైరెక్ట‌ర్స్ అంద‌రూ లేకుండా సింపుల్ గా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సినీ ఇండ‌స్ట్రీలో దాసరి గారి పేరు గుర్తుండేలా వచ్చే ఏడాది బర్త్డేకి ప‌లు మంచి ప‌నులు చేస్తామ‌ని వెల్ల‌డించారు సి.కళ్యాణ్. అనంతరం కొమ‌రం వెంక‌టేష్ మాట్లాడుతూ దాస‌రి గారి లాంటి మంచి మ‌న‌సు ఉన్న వ్య‌క్తులు అతి అరుదుగా క‌నిపిస్తార‌ని అన్నారు. ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా దాస‌రితో త‌నకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాకు దేవుడితో స‌మానం దాస‌రి గారు. ఆయ‌న లేని లోటు సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోట‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అనంత‌రం తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ దాస‌రి నారాయ‌ణ రావు గారి లాంటి ద‌ర్శ‌కులు ఇక‌పై సినీ ప‌రిశ్ర‌మ‌లో వస్తారో రారో తెలియదు. ఆయ‌న మా గురువు గారు అవ్వ‌డం మా అదృష్ట‌మ‌ని చెప్పారు. సంక్రాంతి..ద‌స‌రా పండుగ‌ల్లాగే దాస‌రి గారి జ‌యంతిని ప్ర‌తి ఏటా పండుగ‌లా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్యాకెట్స్ ను కూడా కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు