చైతు – సాయిపల్లవి లాంటి క్రేజీ కాంబినేషన్ తో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఫైనల్ కట్ తో చైతు అసంతృప్తిగా ఉన్నాడని.. నటనలో సాయి పల్లవి తనని పూర్తిగా డామినేట్ చేసిందని తన పార్ట్ ను మరింత బాగా తీర్చిదిద్దడానికి రీషూట్ చేయాలని చైతు కోరినట్లు రూమర్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, లవ్ స్టోరీ మేకర్స్ తాజాగా ఆ రూమర్స్ పూర్తి అవాస్తవాలు అని ఖండించారు. చైతును సాయి పల్లవి డామినేట్ చేసిందనే వార్తలో అసలు నిజం లేదని, సినిమాలో వారిద్దరికీ సమాన ప్రాముఖ్యత ఉందని.. వారి పాత్రలకు తగ్గట్లుగానే ఇద్దరూ అద్భుతంగా నటించారని స్పష్టం చేశారు.
డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. అయితే శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చేస్తోన్న ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఫిదా చేసేలానే ఉన్నాడు.