‘మహా సముద్రం’లో సిద్ధార్థ్ నటించట్లేదు !

‘మహా సముద్రం’లో సిద్ధార్థ్ నటించట్లేదు !

Published on May 3, 2020 10:03 PM IST


దర్శకుడు అజ‌య్ భూప‌తి రెండో సినిమా కోసం బాగానే ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే అజ‌య్ భూప‌తి సినిమా నుండి మాస్ మహారాజా రవితేజతో పాటు నాగచైతన్య కూడా తప్పుకోవడంతో.. అజేయ్, హీరో శర్వానంద్ తో ముందుకు వెళ్తున్నాడు. అలాగే మరో హీరో పాత్రలో సిద్ధార్థ్ నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో సిద్ధార్థ్ నటించట్లేదట. మరి సెకెండ్ హీరో పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. ఇక కరోనా హడావుడి ముగిసాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సినిమాలో సెకెండ్ హీరో పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమాకి ‘మహా సముద్రం’ అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు