‘పుష్ప’ కోసం బాలీవుడ్ స్టార్స్.. పాన్ ఇండియా రేంజ్ లో !

‘పుష్ప’ కోసం బాలీవుడ్ స్టార్స్.. పాన్ ఇండియా రేంజ్ లో !

Published on Apr 12, 2020 9:24 PM IST

స్టార్ హీరో అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా ఫస్ట్ లుక్ జనాలకు బాగానే కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెకెక్కించబోతున్నారు. అందుకే, స్టార్ కాస్ట్ ను కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తీసుకోవటానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారట.

అలాగే మరో కీలక పాత్ర కోసం ఎవెలిన్‌ శర్మను అనుకుంటున్నారట. ఇక విలన్ గా సంజయ్‌ దత్‌, సునీల్‌ శెట్టిలలో ఎవరో ఒకర్ని ఒప్పించాలని సుకుమార్ అనుకుంటున్నాడు. ఇక ఎలాగూ తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. మొత్తానికి అన్ని ఇండస్ట్రీస్ నుండి స్టార్ లను తీసుకుని సినిమా రేంజ్ ను పెంచుతున్నారు.

ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.

అలాగే ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ ఏరి కోరి సైన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

తాజా వార్తలు