కరోనా ఈ స్థాయిలో ప్రభావం చూపిస్తోందని మొన్నటివరకూ సినిమా జనం అస్సలు ఊహించలేదు. దాంతో డబ్బు ఖర్చు చేసి మరీ షూటింగ్ కోసం సెట్స్ వేశారు. యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ బేస్డ్ సినిమా సిటీమార్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం సెట్స్ వేశారు. కానీ అంతలో కరోనా రావటం వల్ల షూటింగ్ ఆపేశారు. మొత్తానికి కరోనా వల్ల సినిమా రంగానికి భారీ నష్టమే మిగిల్చేలా ఉంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్కి కోచ్గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్గా చేస్తోంది. ‘యు టర్న్’లాంటి సూపర్హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు.