నిర్భయ దోషులైన ముకేశ్ సింగ్ ‘ పవన్ గుప్త, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ లకు తిహార్ జైలులో ఉరి శిక్ష విధించారు. నేడు ఉదయం 5.30 గంటలకు జైలు నంబరు 3లో ఒకేసారి నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేశారు. నిర్భయ దోషులకు ఉరి శిక్ష విధించడంపై అటు సామాన్య ప్రజలతో పాటు, సెలెబ్రిటీలు తమ స్పందన తెలియజేశారు.
యాంకర్ కమ్ నటి అనసూయ నిర్భయ దోషుల ఉరిపై స్పందించారు. ”ఇన్సాఫ్కి సుభా.. దేర్ సే హి సహీ అంటూ.. ” హిందీలో పోస్టు పెట్టారు . తీర్పు లేట్ అయిన, సరైనదే జరిగింది అని అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేసింది. అనసూయ తరుచుగా సామాజిక విషయాల పట్ల స్పందన తెలియజేస్తూ ఉంటారు.