‘అల వైకుంఠపురములో’ చిత్రంతో క్లాస్ ట్రీట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఈసారి నూటికి నూరు శాతం మాస్ ట్రీట్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఆయన చేస్తున్న చిత్రం పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ అని, ప్రధానంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులే టార్గెట్ అని తెలుస్తోంది. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో మొత్తం ముగ్గురు ప్రతినాయకులు ఉండనున్నారు. వారే విజయ్ సేతుపతి, జగపతిబాబు, రాజ్ దీపక్ శెట్టి.
ఈ ముగ్గురి పాత్రలు కథలో చాలా టఫ్ అని, వీరికి, అల్లు అర్జున్కి మధ్యన పోరు రసవత్తరంగా ఉంటుందని, ఫైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు స్క్రీన్ ప్లే మూడు కోణాల్లో నడుస్తుందని కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం బన్నీ పూర్తిగా గడ్డం పెంచి లుక్ మార్చుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
అల్లు అర్జున్కు వ్యతిరేకంగా ఆ ముగ్గురు
అల్లు అర్జున్కు వ్యతిరేకంగా ఆ ముగ్గురు
Published on Mar 15, 2020 9:15 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!
- విశ్వంభర: మొత్తానికి పోయిందంతా వెనక్కి!
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘సార్ మేడం’
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!