ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసుకున్న బన్నీ

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసుకున్న బన్నీ

Published on Feb 13, 2020 10:04 PM IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా బన్నీ కెరీర్లో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది ఈ చిత్రం. ఇక విడుదలైన నాటి నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇతర అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం సంధ్య 35 ఎమ్ ఎమ్ థియేటర్లో భారీ రికార్డ్ నమోదు చేసింది.

ఇప్పటివరకూ దాదాపు ఆ ఒక్క థియేటర్ నుండే కోటి రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇలా సంధ్య 35 ఎమ్ ఎమ్ నందు కోటి గ్రాస్ అందుకున్న సినిమాలు చాలా అరుదు. వాటిలో బన్నీ చిత్రం కూడా చేరడం విశేషమనే అనాలి. ఇకపోతే బన్నీ తన తర్వాతి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై బన్నీ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకులందరిలో భారీ అంచనాలున్నాయి.

తాజా వార్తలు