జనవరి 3 న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ ప్రత్యేక ట్రైలర్ ను విడుదలచెయ్యనున్నామని నిర్మాణ బృందం తెలిపింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న భారీ రీతిలో విడుదలకానుంది
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ మరియు అమీ జాక్సన్ హీరోయిన్స్. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రధారులు. దిల్ రాజు నిర్మాత. జనవరి మొదటివారం నుండి ప్రమోషన్లపై దృష్టి పెడతారు
దేవీశ్రీప్రసాద్ సంగీతదర్శకుడు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్