టాలీవుడ్లో కామెడీ జోనర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు కె.వి.అనుదీప్. జాతిరత్నాలు, ప్రిన్స్ వంటి సినిమాలతో ఆయన తన సత్తా చాటారు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడట ఈ డైరెక్టర్.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘లైలా’ డిజాస్టర్ తర్వాత చేస్తున్న ఈ సినిమాలో విశ్వక్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే పాత్రలో నటిస్తు్న్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను విశ్వక్ మార్క్తో కాకుండా అనుదీప్ తనదైన రీతిలో తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ సినిమా అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా తెరకెక్కుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాను 2026 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని అనుదీప్ భావిస్తున్నాడట. దీని కోసం ఆయన తీవ్రంగా కష్టపడుతున్నాడని సినీ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే అనుదీప్ ‘ఫంకీ’ని వచ్చే ఫిబ్రవరిలో తీసుకొస్తాడా లేదా అనేది వేచి చూడాలి.