ఫోటో మూమెంట్: ఏపీ సీఎం చంద్రబాబు, నందమూరి బాలకృష్ణతో మైత్రీ మూవీస్ నిర్మాతలు

నందమూరి బాలకృష్ణకు ఇటీవల భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘పద్మభూషణ్’ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణకు అవార్డు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు తమ విషెస్ తెలిపారు.

అయితే, తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, బాలయ్య సోదరి నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంపై ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ఇక ఈ పార్టీలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు బాలయ్య, చంద్రబాబును కలిసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

పద్మభూషణ్ గ్రహీత బాలకృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబులతో మైత్రీ నిర్మాతలు ముచ్చటించారు. ఇక ఈ పార్టీలో టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్ పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version