లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా ఇద్దరూ ముంబైలోని తమ రెసిడెన్సీలలోనే ఈ ఖాళీ సమయాన్ని గడుపుతున్నారు. అయితే తమకున్న ప్రజాదరణను ఉపయోగించుకుంటూ క్యాష్ చేసుకోవడానికి లాక్ డౌన్ సమయంలో కూడా ఈ అందమైన అందగత్తెలు ఇద్దరూ ప్రమోషన్స్ లో పడ్డారు. కొత్తగా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
కాజల్, తమన్నా తమ సోషల్ మీడియా పేజీలలో మొబైల్ బిల్ చెల్లింపు యాప్ అండ్ గేమ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ విడియోలను పోస్ట్ చేశారు. భారత్ బిల్ పే యాప్ను కాజల్ ప్రమోట్ చేయగా, ఎంపిఎల్ గేమ్స్ యాప్ను తమన్నా ప్రమోట్ చేసింది. తమన్నా అయితే ఈ రోజంతా ఎంపిఎల్లో మొబైల్ గేమ్స్ ఆడతానని కూడా చెప్పింది. ఏమైనా ఖాళీ టైంను క్యాష్ చేసుకుంటున్నారు ఈ ఇద్దరూ.
https://twitter.com/MsKajalAggarwal/status/1262356081080102912