శిరిడి సాయి చిత్రానికి నీరాజనం పట్టిన జనం


టాలివుడ్ అందగాడిగానే కాదు, భక్తి రస చిత్రాలకు ప్రసిద్ది చెందిన నటుడు నాగార్జున. పరిశ్రమలో పెద్ద హీరోగా పేరొందినా కూడా ప్రయోగాలకు తానెప్పుడు సిద్దమే అని చెప్పే అతికొద్ది మంది హీరోలలో నాగార్జున ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి తరం ప్రేక్షకులను కూడా భక్తిరస చిత్రాలతో మెప్పించడం నాగార్జునకి మాత్రమే సాధ్యమయ్యింది. ఈ ప్రయత్నంలో ఆయన “అన్నమయ్య” మరియు “శ్రీ రామ దాసు” వంటి చిత్రాలలో తన నటనతో అటు పెద్దలనే కాకుండా యువతను కూడా ఆకట్టుకున్నారు. కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున సాయి బాబాగా నటించిన “శిరిడి సాయి” చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది.ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు ఈ చిత్రంలో నాగార్జున నటన గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు ప్రత్యేకంగా చివరి ముప్పై నిమిషాలు తెర మీద మాకు నాగార్జున కనపడలేదని సాక్షాత్ సాయినాధుడు కనిపించారని అంటున్నారు. సాయిబాబాలోని ప్రేమరసాన్ని నాగార్జున అద్భుతంగా తెర మీద పండించారని కొన్ని సన్నివేశాల్లో అయన నటనతో కంటతడి పెట్టించారని జనం అంటున్నారు. ఇలానే అయన మరిన్ని భక్తి చిత్రాలను చెయ్యాలని కోరుకుంటున్నారు. కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version