టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న SSMB29 కూడా ఒకటి. ఈ సినిమాతో మహేష్ బాబు అంతర్జాతీయంగా తన సత్తా చాటేందుకు రెడీ అవుతుండగా.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాతో తన పనితనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో పాన్ ఇండియన్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో పలు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమాలోని ఇతర క్యాస్టింగ్ విషయంలో పలు చర్చలు సాగుతున్నాయట.
అయితే, ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించేందుకు ఓ తమిళ స్టార్ నిరాకరించాడట. తమిళ స్టార్ హీరోగా చియాన్ విక్రమ్ తెలుగులో కూడా ఎలాంటి పాపులారిటీ సాధించాడో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం ఆయన్ను చిత్ర యూనిట్ అప్రోచ్ అవగా ఆయన రిజెక్ట్ చేసినట్లు చిత్ర వర్గాల టాక్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి.