తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బైసన్’. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ సందర్భంగా ఈ మూవీ నుండి ‘తీరేనా తీరేనా’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు తమిళ లిరిక్స్ మారి సెల్వరాజ్ అందించగా తెలుగు లిరిక్స్ ఎనమంద్రా రామకృష్ణ అందించారు. నివేస్ కే ప్రసన్న ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాటలో ధృవ్ విక్రమ్ ఇంటెన్స్ లుక్స్తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో వస్తుండగా తెలుగులో జగదాంబే ఫిలిమ్స్ పై నిర్మాత బాలాజీ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా జగదాంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ మాట్లాడుతూ..”ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ధృవ్ తనదైన పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నాం.” అని అన్నారు.
ఈ సినిమాలో పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి మదన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా రంజిత్, అదితి ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి