కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘ది రాజాసాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఐతే, ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం మొదటి సింగిల్ అప్ డేట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ ఒక అప్డేట్ను పంచుకున్నారు. మొదటి ట్రాక్ విడుదల గురించి ఒక వారంలో ప్రకటన వస్తుందని, పైగా ఈ సినిమాలోని మూడు పాటలను వరుసగా విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు.
ఐతే, అభిమానులు చిత్రానికి వ్యతిరేకంగా కామెంట్స్ చెయ్యొద్దు అని, ఈ చిత్రం ఖచ్చితంగా అందర్నీ అలరిస్తుందని థమన్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ కథానాయికలు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. జనవరి 9, 2026న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.
