నాకు కరోనా లేదంటున్న స్టార్ యాంకర్.

కరోనా వైరస్ వ్యాప్తి అధికంగాఉన్న నేపథ్యంలో ఎప్పుడు ఎవరు దీని భారిన పడతారో అర్థం కావడం లేదు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత మరియు నటుడు బెల్లంకొండ గణేష్ దీని బారిన పడిన సంగతి తెలిసిందే . అలాగే ఇద్దరు బుల్లితెర నటులకు కరోనా వైరస్ సోకింది. కాగా ప్రముఖ యాంకర్ మరియు బుల్లితెర హోస్ట్ ఓంకార్ కి కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 24న ఆయన కరోనా సోకిందని, అలాగే తన కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారని కథనాలు వెలువడ్డాయి.

ఐతే ఈ వార్తలపై ఓంకార్ స్పందించారు. తనకు తన కుటుంబానికి కరోనా సోకింది అనడంలో ఎటువంటి నిజం లేదని ఆయన చెప్పారు. తమ కుటుంబానికి కరోనా సోకిందన్న వార్తలలో ఎటువంటి నిజం లేదని వారు తెలియజేశారు. ఇక గత ఏడాది ఓంకార్ తన తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా రాజుగారి గది 3 తెరకెక్కించారు. ప్రస్తుతం కొన్ని కొన్ని షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version