మహేష్ బాబుతో ‘వారణాసి’ కథ చెప్పబోతున్న రాజమౌళి?

టాలీవుడ్ సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘SSMB29’ చిత్ర టైటిల్, గ్లింప్స్ రివీల్ ఈ ఈవెంట్‌లో జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈవెంట్‌లో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్స్‌లో ఈ చిత్ర గ్లింప్స్‌ను ప్లే చేశారు. అక్కడున్న అభిమానులు ఈ గ్లింప్స్‌ను మొబైల్ ఫోన్స్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోల్లో SSMB29 చిత్ర టైటిల్ ‘వారణాసి’గా జక్కన్న ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు లుక్ కూడా ఇందులో రివీల్ కావడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

అయితే, అధికారికంగా ఈ గ్లింప్స్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కెఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ చిత్రానికి నిజంగానే వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారా అనేది మరికొద్ది నిమిషాల్లో తేలనుంది.

Exit mobile version