ఇప్పటికీ స్ట్రాంగ్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్న ‘సింగిల్’

మన టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హీరో శ్రీవిష్ణు హీరోగా ఇవానా, కేతిక శర్మ హీరోయిన్స్ గా దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనింగ్ చిత్రమే “సింగిల్”. శ్రీవిష్ణు కెరీర్లో మరో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఎప్పుడో 25 కోట్లకి పైగా గ్రాస్ ను అందుకుంది. అయితే అక్కడ నుంచి సినిమా స్లో అవ్వలేదు. మళ్ళీ రెండో వీకెండ్ లోకి వచ్చినప్పటికీ సాలిడ్ బుకింగ్స్ ని అందుకుంటుంది.

అలా నిన్న శనివారం స్ట్రాంగ్ బుకింగ్స్ ని బుక్ మై షోలో చూపించింది ఈ చిత్రం. గత 24 గంటల్లో 32 వేలకి పైగా టికెట్స్ బుక్ చేసుకొని ఊహించని హోల్డ్ ని ఈ చిత్రం కనబరచడం అనేది విశేషం. ఇక ఈ ఆదివారం కూడా ఇదే రేంజ్ లో బుకింగ్స్ నమోదు అవుతాయని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది.

Exit mobile version