‘స్పిరిట్’ మేకర్స్ కి భారీ గానే మిగిలిందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో సెన్సేషనల్ కాంబినేషన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో కూడా ఒకటి. అయితే అతి త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా విషయంలో రీసెంట్ గా వచ్చిన హీరోయిన్ వార్తలకి చెక్ చెబుతూ మేకర్స్ సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని అనౌన్స్ చేసి సోషల్ మీడియా షేక్ చేశారు.

ఇక ఈ అనౌన్సమెంట్ తోనే మేకర్స్ భారీ మొత్తంలో సేవ్ చేసుకున్నట్టుగా కూడా టాక్ వైరల్ గా మారింది. దీపికా ప్లేస్ లో ఈమెని తీసుకోవడంతో భారీ లెవెల్లో డబ్బులు సేవ్ అవ్వడం నుంచి ఇంకా ఫ్యాషనేటెడ్ గా వర్క్ చేసే ఫీమేల్ లీడ్ దక్కినట్టు అయ్యిందని వినిపిస్తుంది.

అనిమల్ సినిమాతో త్రిప్తికి సందీప్ ఎలాంటి లైఫ్ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఇపుడు ఏకంగా ఫీమేల్ లీడ్ లో అనౌన్స్ చేయడంతో ఆమె మరింత శ్రద్దగా పని చేస్తుంది కూడా. సో ఇలా చాలా విషయాల్లో స్పిరిట్ మేకర్స్ కి కలిసొచ్చే పని అయ్యిందని అభిమానులు అలాగే సినీ వర్గాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు.

Exit mobile version