సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సంబరాల యేటి గట్టు’ ఇప్పటికే సినీ లవర్స్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు రోహిత్ కెపి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా అత్యంత భారీ స్కేల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ పూర్తి మేకోవర్ చేశాడు.
అయితే, ఈ చిత్ర షూటింగ్ నిర్విరామంగా 120 రోజుల పాటు కొనసాగింది. ఈ లెంగ్తీ షెడ్యూల్లో సినిమాకు సంబంధించి చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ షెడ్యూల్తో సినిమా ఏకంగా 75 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం మరో మూడు భారీ సెట్స్ ఈ చిత్రం కోసం రెడీ చేస్తున్నారట మేకర్స్.
ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పాత్ర పవర్ఫుల్గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయికుమార్, అనన్య నాగళ్ల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండగా కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.