ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కరెక్ట్ చేసుకోవాల్సింది ఇదే – బన్నీ వాసు హాట్ కామెంట్స్

రీసెంట్ గానే మన తెలుగు సినిమా దగ్గర జరిగిన హంగామా కోసం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ కి ముందు సినిమా థియేటర్స్ మూసేస్తారు అని వచ్చిన వార్త సంచలనంగా మారడమే కాకుండా ఒక్కసారిగా టాలీవుడ్ ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ క్రమంలో పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా ఎగ్జిబిటర్లు కూడా కీలక మీటింగ్ లు ప్రెస్ మీట్ లు కూడా పెట్టడం జరిగింది.

మరి టాలీవుడ్ ఎదుర్కొంటున్న గడ్డు కాలంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తన వెర్షన్ ని వినిపించారు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని తెలిపారు. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలా సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే.. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి అని హెచ్చరించారు.

అలాగే ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి అని మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది అని తన వెర్షన్ ని ఈ రీసెంట్ ఇష్యూపై లేవనెత్తారు.

Exit mobile version