ఫోటో మూమెంట్: పళని మురుగన్ సన్నిధిలో సూర్య, వెంకీ అట్లూరి

కోలీవుడ్ సహా తెలుగులో కూడా మంచి ఆదరణ ఉన్న తమిళ్ హీరోస్ లో విలక్షణ నటుడు సూర్య కూడా ఒకరు. మరి సూర్య హీరోగా నటించిన రీసెంట్ చిత్రం రెట్రో ఓటిటిలోకి వచ్చి కూడా అదరగొడుతుంది. ఇక ఈ సినిమా వచ్చిన నెల లోపే తన కొత్త చిత్రాన్ని మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఈ చిత్రాన్ని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా లేటెస్ట్ గా ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది హీరో సూర్య నిర్మాత నాగవంశీ అలాగే దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి పళని మురుగన్ ఆలయ సన్నిధిలో కనిపించారు. షూటింగ్ ముందు ఆశీస్సులు తీసుకున్నట్టుగా తెలిపారు. ఇక ఫుల్ ఫ్లెడ్జ్ షూటింగ్ ని జూన్ 9 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి కూడా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుంది.

Exit mobile version