టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రం కోవిడ్ సమయంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాను వినోద్ అనంతోజు డైరెక్ట్ చేయగా దీనికి ఓటీటీలో సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో ఓ సినిమా రాబోతుంది.
వీరిద్దరి కాంబినేషన్లో ఈసారి ఓ కల్ట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, గతంలో మాదిరే ఈసారి కూడా వీరి కాంబోలో రాబోతున్న చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘తక్షకుడు’ అనే టైటిల్తో రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఏకంగా 30 భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడంపై నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేయాలి.. మరికొన్ని సినిమాలు నేరుగా ప్రేక్షకులను అలరించాలి.. అందుకే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం..’ అంటూ ఆయన కామెంట్ చేశారు.
