పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఆయన ప్రెస్టీజియస్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేశారు. ఇక సుజిత్ డైరెక్షన్లో ‘ఓజి’ చిత్రాన్ని కూడా ముగించే పనిలో పవన్ ఉన్నాడు. ప్రస్తుతం ముంబైలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే, ఈ షూటింగ్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నాడు. కానీ, ఆయనకు ఉన్న పొలిటికల్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయనపై కొన్ని సీన్స్తో పాటు యాక్షన్ సీక్వెన్స్లను కూడా ఆయన బాడీ డబుల్ పై చిత్రీకరిస్తున్నారట. పవన్ సెట్స్లో ఉన్నా కూడా ఈ బాడీ డబుల్ అందుబాటులో పెట్టుకుంటున్నారట. ఆయనకు ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చి వెళ్లే పరిస్థితి వచ్చినా, బాడీ డబుల్తో షూట్ పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట.
ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.