సర్కారు వారి పాటలో సెకండ్ హీరోయిన్ ఎవరంటే?

సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత మహేష్ నుండి వస్తున్న సర్కారు వారి పాట మూవీపై భారీ అంచనాలున్నాయి. దర్శకుడు పరశురామ్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ తో సినిమాపై ఆసక్తి పెంచేశాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కీర్తి స్వయంగా వెల్లడించింది. కాగా ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ కి కూడా అవకాశం ఉందట. ఓ కీలక పాత్ర కోసం హీరోయిన్ నివేదా థామస్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట.

సర్కారు వారి పాటలో సెకండ్ హీరోయిన్ గా చేయడానికి ఆమె ఒకే చెప్పారని వస్తున్న సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే నివేదాకు లక్ చిక్కినట్లే. ప్రస్తుతం నివేదా, పవన్ హీరోగా తెరక్కుతున్న వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో నివేదా కథలో కీలమైన ఓ రోల్ చేస్తున్నారు. అలాగే నాని తో చేసిన వి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Exit mobile version