టాలీవుడ్లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ చిత్రం ‘కన్నప్ప’ షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా హీరో విష్ణు మంచు ఈ సినిమాలో కన్నప్పగా కనిపిస్తాడు. ఇక ఈ సినిమాను కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేశారు. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్ను చిత్ర యూనిట్ గ్రాండ్గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన కన్నప్ప కథను మోహన్ బాబు రివీల్ చేశారు.
తన కళ్లను శివుడికి ఇచ్చి తిన్నడు ‘కన్నప్ప’గా చరిత్రలో నిలిచిపోయాడు. తనకు మాత్రం తన తల్లిదండ్రులు నిజమైన కన్నప్పగా మోహన్ బాబు అభివర్ణించారు. తన బిడ్డల ఆకలి తెలుసుకుని తీర్చే ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప అని మోహన్ బాబు అన్నారు. ఇక తన తల్లి లక్ష్మమ్మ పుట్టుకతో రెండు చెవులు వినించవని.. ఆమెకు ఐదు మంది సంతానం అని.. తమ ఊరికి వెళ్లాలంటే బస్సు దిగి 7 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేదని.. తన ఐదు మంది సంతానంను ఎత్తుకుని ఆమె తమ ఊరికి తీసుకెళ్లేందుకు ఎంతో కష్టపడేదని ఆయన తెలిపారు.
తన కంఠాన్ని అందరూ మెచ్చుకుంటే, ఆ మాటలు తన తల్లి వింటే ఎంతో బాగుండేదని ఆయనకు చాలా సార్లు అనిపించిందని.. ఈ విషయాలను తలుచుకున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యేవాడినని మోహన్ బాబు అన్నారు. ఇలా ఆయన తన జీవితంలోని కన్నప్ప స్టోరీని వివరించి తీరు అభిమానులను ఇంప్రెస్ చేస్తోంది.